Ananthapur: అనంతపురం ఐడీబీఐ బ్యాంకుల చోరి కేసు పోలీసులు చేధించారు. కేసు వివరాలను జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. చోరి కేసును 12 గంటల్లోనే చేధించామని తెలిపారు.
దోపిడి కి పాల్పడిన సీఎంఎస్ ఏజెంట్ తోపాటు అతని స్నేహితులను అరెస్ట్ చేసామని ఎస్పీ తెలిపారు. నిందితులు వద్ద నుంచి రూ.46 లక్షలు, 2 బైక్ లు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసును చేధించేందుకు కృషి చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.
రూ. 46 లక్షలు చోరికి గురయ్యాయని ఐడీబీఐ బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. కేవలం 12 గంటల వ్యవధిలోనే నిందితులను గుర్తించారు.