AP Elections : వైసీపీలో ఎమ్మెల్యే సీట్లు కోసం రగడ సాగుతోంది.అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో అధికారపార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకి టికెట్ కేటాయించకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
మామిడికుదురు మండలం నగరంలోని ఎమ్మెల్యే స్వగృహం వద్ద నియోజకవర్గ వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు సమావేశం అయ్యారు. సర్పంచ్లు, ఎంపీటీసిలంతా కలసి తాడేపల్లికి పయనమయ్యారు. ఒకవేళ చిట్టిబాబుకి టిక్కెట్ ఇవ్వకపోతే.. తాము పార్టీని వీడేందుకు సిద్ధమంటున్నారు.
ఇప్పటికే పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును సీఎం జగన్ తాడేపల్లికి పిలిచి మాట్లాడారు. మరోవైపు ఈ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా అమలాపురం ఎంపీ చింతా అనురాధను బరిలోకి దించాలని భావిస్తున్నారు. ఈ వార్తల నేపథ్యంలోనే ఎమ్మెల్యే చిట్టిబాబు అనుచరులు రాజీనామా హెచ్చరికలు చేస్తున్నారు.