CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే….గురువారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లనున్నారు. సీడబ్ల్యూసీ మీటింగ్ పాల్గొననున్నారు.
ఇటీవల ఐదు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ లో చర్చించనున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సభ్యులు సమాలోచనలు జరపనున్నారు.