కామారెడ్డి జిల్లాలో సంచలనం రేపిన వరుస హత్యల కేసులో.. పోలీసులు కస్టడీ పిటీషన్ వేశారు. ఈ మేరకు నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని ఎల్లారెడ్డి కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయటం సహా మరో రెండు మృతదేహాల గుర్తింపు కోసం నిందితులను కష్టడికి ఇవ్వాలన్న పోలీసులు కోరుతున్నారు. కస్టడీ పిటిషన్ పై ఇవాళ న్యాయమూర్తి విచారించనున్నారు.
వరుస హత్యల ఘటనలో మరో రెండు మృతదేహాల కోసం పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆరుగురిని హత్య చేసి ఒక్కో చోట మృతదేహాలను నిందితులు వదిలేశారు. ఇప్పటివరకూ నాలుగు మృతదేహాలను మాత్రమే గుర్తించగా.. మరో రెండు దొరకాల్సి ఉంది. మాదాపూర్ అటవీప్రాంతంలో ప్రసాద్ మృతదేహం పూడ్చిపెట్టినట్లు నిందితులు తెలిపారు. ప్రసాద్ భార్య శాన్వీక మృతదేహాన్ని.. బాసర గోదావరిలో పడేసినట్లు ఒప్పుకున్నాడు. కాగా.. మరో రెండు మృతదేహాల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రసాద్ మృతదేహాన్ని బుధవారం ఫోరెన్సిక్ పోలీస్, రెవెన్యూ అధికారుల సమక్షంలో వెలికితీసే అవకాశముంది.