Hyderabad : ఇంట్లో తల్లి శవాన్ని పెట్టుకొని మూడు రోజులుగా గదిలోనే అన్న, చెల్లి గడిపారు. ఈ ఘటన హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్ లో ఓ ఇంట్లో చనిపోయిన మహిళ(40) శవంతోనే మూడు రోజులు అన్నచెల్లి గడిపారు. కుళ్లిపోయి పురుగులు పట్టిన మృతదేహాన్ని దహన సంస్కారాలు చేయకుండా ఇంటిలోనే ఉంచారు.
ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ఇంటికి వచ్చి చూడగా కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. కుటుంబీకుల మతిస్థిమితం సరిగ్గా లేకనే విషయం బయటకు రాలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. అన్న, చెల్లిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.