కరోనా మహమ్మారి మళ్ళీ కోరలు చాస్తుంది. ప్రపంచం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసినా ఈ పెనుభూతం.. ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని సంతోషిస్తున్న వేళ ఇప్పుడు కొత్త వేరియంట్ మళ్లీ గుబులు రేపుతోంది. కొత్త వేరియంట్ కారణంగా దేశంలో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. ఒక్కరోజు వ్యవధిలోనే ప్రపంచ వ్యాప్తంగా వేల మంది కొవిడ్ బారిన పడుతున్నారు.
మన దేశంలో కూడా గడిచిన 24 గంటల్లో 341 కొత్త కేసులు నమోదు కావడం భయాందోళన కలిగిస్తుంది. కాగా కేరళలో కోవిడ్-19 కారణంగా ముగ్గురు మృతి చెందడం ప్రజల్ని కలవరానికి గురి చేస్తుంది. అలానే గత 24 గంటల్లో రాష్ట్రాల వారీగా నమోదైన కేసులను గమనిస్తే.. కేరళలో 292..తమిళనాడు 13.. మహారాష్ట్ర 11.. కర్ణాటక 9.. పుదుచ్చేరిలో 4.. ఢిల్లీ, గుజరాత్ లలో చెరో 3.. పంజాబ్, గోవా లలో చెరో 1 కేసు నమోదైంది.
అయితే కొత్త వేరియంట్కు సంబంధించి తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. ఈ వేరియంట్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. జేఎన్1 వేరియంట్ ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని.. దీనిని ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా వర్గీకరించారు. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు జేఎన్1తో పాటు ఇతర వేరియంట్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.
ఇక తెలంగాణలో సైతం నాలుగు కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అవసరమైన ప్రణాళికను సీఎం రేవంత్ సర్కారు సిద్ధం చేస్తుంది. కోవిడ్ టెస్ట్ల సంఖ్యను పెంచి.. మెడికల్ కిట్లు, మందులను ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు.