Cm Revanthreddy: దేశరాజధాని ఢిల్లీలోని తన అధికారిక నివాసాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్లోని 23వ నెంబర్ బంగ్లా తెలంగాణ సీఎం అధికారిక నివాసంగా కేటాయించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఢిల్లీ వచ్చినప్పుడు కేసీఆర్ ఉండేవారు. తాాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఈ బంగ్లాను సీఎం రేవంత్ రెడ్డికి కేటాయించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఢిల్లీలోని అధికారిక నివాసానికి రేవంత్ రెడ్డి వెళ్లడం ఇదే తొలిసారి.
ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి మొదటగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ లో పీఏసీలో జరిగిన చర్చల గురించి, రాబోయే పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించిన అంశాల గురించి చర్చించారు. అనంతరం సీఎం అధికారిక నివాసానికి వెళ్లారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉమ్మడి ఏపీ భవన్ విభజన, కొత్తగా తెలంగాణ భవన్ నిర్మాణంపై దృష్టి పెట్టారు. ఢిల్లీలోని తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, OSD సంజూ జాజుతో చర్చించారు. ఉమ్మడి ఏపీ ఆస్తుల్లో తెలంగాణ వాటాలు ఏమి రావాల్సి ఉన్నాయనే అంశాలపై దృష్టి పెట్టారు. వీలైనంత త్వరగా వాటిని సాధించుకుని, కొత్త నిర్మాణాలు చేపట్టాలని భావిస్తున్నారు.