Tirupati Murder : డబ్బుల కోసం ఓ మహిళ చిన్నపిల్లాడిని అత్యంత పాశవికంగా హత్య చేసిన దారుణ ఘటన తిరుపతిలోని వరదయ్యపాలెం మండలం కాంబాకం గ్రామంలో చోటుచేసుకుంది. పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాతో కలిసి ఓ మహిళ తన మేనల్లుడిని కిడ్నాప్ చేసి.. హత్య చేసింది.
రేఖ అనే మహిళ తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో సొంత మేనల్లుడైన ఎనిమిదేళ్ల హనీశ్ ను అపహరించి తిరుపతి జిల్లాకు తీసుకొచ్చింది. రూ.25 లక్షల కోసం.. పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాతో చేతులు కలిపి హనీశ్ ను హత్య చేసి గోనె సంచిలో మూటగట్టి ముళ్ల పొదల్లో పడేసింది.
అక్కడ ఉన్న స్థానికులు ముళ్లపొదల్లో పడి ఉన్న గోనెసంచి మూటను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మూటను విప్పి చూడగా బాలుడి మృతదేహం కనిపించింది. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి ఒడిగట్టింది బాలుడి అత్త రేఖ అని దర్యాప్తులో తేలగా.. ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.