Prajavani : హైదరాబాద్ ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. అర్జీలు సమర్పించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. భూవివాదాలు, పింఛన్లకు సంబంధించిన సమస్యలపై అధికారులకు వినతులు ఇచ్చేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం, శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది.
మంగళవారం ఒక్కరోజే 5వేలకు పైగా దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.