అవీనీతి అక్రమాలపై మాజీ మంత్రి సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వరదాపురం గ్రామ సమీపంలోని రుస్తుం, భారత్ మైన్ లో జరుగుతున్న అవీనీతి అక్రమాలపై మాజీ మంత్రి సత్యాగ్రహ దీక్ష చేశారు. పోలీసులు సోమిరెడ్డి దీక్షను భగ్నం చేశారు .
అడ్డుకున్న టిడిపి నాయకులు, కార్యకర్తలపైకి పోలీస్ వాహనం దూసుకెళ్లింది. పరిస్థితి ఉద్రిక్తం కావడంతో పోలీసులు టిడిపి నాయకులు , కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. అక్రమ మైనింగ్ కు సోమిరెడ్డి వ్యతిరేకంగా 4 రోజులుగా సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. డిసెంబర్ 18న భారీ సంఖ్యలో హిజ్రాలు సోమిరెడ్డి దీక్ష శిబిరం వద్దకు వచ్చి దీక్షను భగ్నం చేయాలని ప్రయత్నించారు.
లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని పోలీసులు దీక్షను విరమించాలని సోమిరెడ్డిని కోరారు. అక్రమ మైనింగ్ పై కోర్టు ఆదేశాలు ఇంప్లిమెంట్ చేస్తేనే దీక్షను విరమిస్తానని సోమి రెడ్డి భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో శిబిరం వద్ద ఉండేందుకు నలుగురికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు.
అనుమతి ఇచ్చినప్పటికీ డిసెంబర్ 19 తెల్లవారుజామున 2.30 గంటలకు భారీ సంఖ్యలో పోలీసులు దీక్ష శిబిరం వద్దకు చేరుకున్నారు. సోమిరెడ్డిని బలవంతంగా జీప్ లోకి ఎక్కించారు. పోలీసుల చర్యకు వ్యతిరేకంగా టిడిపి కార్యకర్తలు నినాదాలు చేశారు.