EPAPER

Somireddy Deeksha: అక్రమ మైనింగ్ పై సోమిరెడ్డి దీక్ష.. పోలీసుల లాఠీచార్జ్

Somireddy Deeksha: అక్రమ మైనింగ్ పై సోమిరెడ్డి దీక్ష.. పోలీసుల లాఠీచార్జ్
latest news in andhra pradesh

Somireddy Deeksha(Latest news in Andhra Pradesh):

అవీనీతి అక్రమాలపై మాజీ మంత్రి సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వరదాపురం గ్రామ సమీపంలోని రుస్తుం, భారత్ మైన్ లో జరుగుతున్న అవీనీతి అక్రమాలపై మాజీ మంత్రి సత్యాగ్రహ దీక్ష చేశారు. పోలీసులు‌ సోమిరెడ్డి దీక్షను భగ్నం చేశారు .


అడ్డుకున్న టిడిపి నాయకులు, కార్యకర్తలపైకి పోలీస్ వాహనం దూసుకెళ్లింది. పరిస్థితి ఉద్రిక్తం కావడంతో పోలీసులు టిడిపి నాయకులు , కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. అక్రమ మైనింగ్ కు సోమిరెడ్డి వ్యతిరేకంగా 4 రోజులుగా సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. డిసెంబర్ 18న భారీ సంఖ్యలో హిజ్రాలు సోమిరెడ్డి దీక్ష శిబిరం వద్దకు వచ్చి దీక్షను భగ్నం చేయాలని ప్రయత్నించారు.

లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని పోలీసులు దీక్షను విరమించాలని సోమిరెడ్డిని కోరారు. అక్రమ మైనింగ్ పై కోర్టు ఆదేశాలు ఇంప్లిమెంట్ చేస్తేనే దీక్షను విరమిస్తానని సోమి రెడ్డి భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో శిబిరం వద్ద ఉండేందుకు నలుగురికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు.


అనుమతి ఇచ్చినప్పటికీ డిసెంబర్ 19 తెల్లవారుజామున 2.30 గంటలకు భారీ సంఖ్యలో పోలీసులు దీక్ష శిబిరం వద్దకు చేరుకున్నారు. సోమిరెడ్డిని బలవంతంగా జీప్ లోకి ఎక్కించారు. పోలీసుల చర్యకు వ్యతిరేకంగా టిడిపి కార్యకర్తలు నినాదాలు చేశారు.

Tags

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×