CM Jagan Mohan Reddy : రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఇంచార్జ్ లను మార్చిన సీఎం.. సొంత పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తున్నారు. ఎమ్మెల్యేలకే కాదు మంత్రులకి కూడా షాక్ ఇస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
మొన్న విడదల రజిని, మేరుగ నాగార్జున, ఆదిములపు సురేష్లకు స్థాన చలనం కల్పించిన జగన్.. ఇవ్వాళ రేపట్లో జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల్, గుడివాడ అమర్నాథ్, తానేటి వనిత, విశ్వరూప్, దాడిశెట్టి రాజాల స్థానాలు మార్చే అవకాశం కనిపిస్తోంది.
మొత్తంగా తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీలో పడకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు సీఎం జగన్. వై నాట్ 175 అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఇదిలా ఉండగా వైసీపీ నేతల్లో మాత్రం టెన్షన్ మొదలయ్యింది. ఎమ్మెల్యేలకు కాదు మంత్రులకు కూడా స్థాన చలనం కల్పించడంతో ఏపీ రాజకీయాలు హాట్గా మారాయి.