Yuvagalam : ఏపీ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర ముగిసింది. మొత్తంగా 226 రోజుల పాటు యువగళం పాదయాత్ర సాగింది. నారా లోకేష్ మొత్తంగా 3132 కిలో మీటర్లు మేర పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు.
ఇక పాదయాత్ర ముగిసిన సందర్భంగా గాజువాకలోని అగనంపూడి టోల్ గేట్ వద్ద మినీ పైలాన్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు పాదయాత్ర ముగించిన చోటే యువగళం పాదయాత్ర కూడా ముగించనుండడం మరో విశేషం. ఇక డిసెంబర్ 20న భోగాపురంలో ముగింపు సభను ఏర్పాటు చేశారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో జనవరి 27న ప్రారంభమైన యువగళం 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు సాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగుస్తుందని లోకేశ్ సమరశంఖం పూరించారు. కానీ గాజువాకలో పాదయాత్రకు ముగింపు పలికారు.