EPAPER
Kirrak Couples Episode 1

Uttam Kumar Reddy : మేడిగడ్డపై సమీక్ష.. ఎల్ అండ్ టి ప్రతినిధులపై మంత్రి సీరియస్..

Uttam Kumar Reddy : మేడిగడ్డపై సమీక్ష.. ఎల్ అండ్ టి ప్రతినిధులపై మంత్రి సీరియస్..

Uttam Kumar Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ పనులు చేసిన ఎల్ అండ్ టి ఏజెన్సీ ప్రతినిధులతో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఎల్ అండ్ టి గ్రూప్ డైరెక్టర్ ఎస్. వి దేశాయ్ పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. ఎల్. అండ్ టి ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. అంత పెద్ద ప్రాజెక్ట్ లో నాసిరకం పనులు ఎలా చేశారని అసహనం వ్యక్తం చేశారు.


ఇంత బాధ్యతా రాహిత్యంగా బ్యారేజ్ పనులు ఎలా చేశారని నిలదీశారు. ప్రజా ధనాన్ని ఎలా దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి తమ ప్రమేయం లేదు అని తప్పించుకోవాలంటే ఊరుకోమని హెచ్చరించారు. ప్రజా ధనాన్ని వృధా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఎవ్వరినీ వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు .

మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధించిన పూర్తి స్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టు ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడాలన్నారు ఆయన. తప్పు చేసిన వారు తప్పించుకోవాలని చూస్తే న్యాయ పరంగా, చట్ట పరంగా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రి హెచ్చరించారు.


Tags

Related News

Bigg Boss 8 Day 20 Promo: పెళ్లాం పై కోపంతో బిగ్ బాస్.. అభయ్ ను బయటకు గెంటేసిన నాగార్జున..!

Devara Run Time : ఫియరే లేని దేవరకు ఫియర్ పట్టుకుందా… మరీ ఇంత కట్ చేశారేంటి.?

Samantha: సమంత సైలెంట్ ఏలా? టాలీవుడ్‌లో హేమా కమిటీ వేయాలన్న సామ్.. జానీ మాస్టర్ కేసుపై స్పందించదే?

Manchu Vishnu: కల్తీ లడ్డూ.. ప్రకాష్ రాజ్ కి కౌంటర్.. పవన్ కళ్యాణ్ కి అండగా నిలిచిన విష్ణు..!

Tollywood heroine: తెలుగు హీరోయిన్ భర్తకి యాక్సిడెంట్.. ఐసీయూలో చేరిక.!

Saripodhaa Sanivaram: 28 రోజులకే ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అంటే..?

Mrunal thakur: అతడిని పరిచయం చేసిన మృణాల్.. ఆగలేకపోతున్న అంటూ పోస్ట్..!

Big Stories

×