IPS Transfers : సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూకుడును పెంచింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న అధికారులను బదిలీలు చేస్తోంది సీఎం రేవంత్ సర్కార్. గత కొన్ని రోజులుగా ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే మరో 9 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ చేపడుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్లో సిట్, క్రైమ్స్ జాయింట్ సీపీగా ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ జాయింట్ సీపీగా విశ్వప్రసాద్, వెస్ట్ జోన్ డీసీపీగా విజయ్కుమార్, స్పెషల్ బ్రాంచ్ డీసీపీగా జోయల్ డేవిస్, నార్త్ జోన్ డీసీపీగా రోహిణి ప్రియదర్శిని, సీసీఎస్ డీసీపీగా ఎన్.శ్వేత, హైదరాబాద్ ట్రాఫిక్-1 డీసీపీగా ఎస్ సుబ్బారాయుడిని బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
టాస్క్ ఫోర్స్ డీసీపీగా పని చేస్తున్న నికిత పంత్, సిట్ క్రైమ్స్ జాయింట్ సీపీగా పని చేస్తున్న గజరావ్ భూపాల్, నార్త్ జోన్ డీసీపీగా పని చేస్తున్న చందనా దీప్తీలను డీజీపీ ఆఫీస్ లో రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.