Tamil Nadu : తమిళనాడులోని మధురై ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. వీరంతా శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు స్వాములు ఉండగా.. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతులు ములుగు జిల్లా కమలాపురం గ్రామానికి చెందిన సుబ్బయ్య నాయుడు, సాంబయ్య, రాజులుగా గుర్తించారు.