EPAPER

Purandeswari: “టిడ్కో ఇళ్లను బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన జగన్ “.. పురందేశ్వరి ఆరోపణ..

Purandeswari: “టిడ్కో ఇళ్లను బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన జగన్ “.. పురందేశ్వరి ఆరోపణ..

Purandeswari: బ్యాంకు నోటీసులపై కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. పాలకొల్లులో టిడ్కో ఇళ్ల సముదాయాన్ని పరిశీలించిన ఆమె లబ్దిదారులతో మాట్లాడారు. పాలకొల్లులో నిర్మించిన టిడ్కో ఇళ్లలో కనీస వసతులు కల్పించకుండా బాధితులకు ఇళ్లను ఇచ్చారన్నారు. మౌళిక వసతులు లేక బాధితులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.


కేంద్ర ప్రభుత్వం జిల్లాకు లక్షా 5 వేలకు పైగా ఇల్లు మంజూరు చేస్తే వాటిలో ఎన్ని ఇల్లు నిర్మించి లబ్ధిదారులకు అందించారో జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు. ఆడుదాం ఆంధ్ర కాదని.. వైసీపీ ప్రభుత్వం ప్రజలతోనే ఆడుకుంటుందని విమర్శించారు.

మాట తప్పం ..మడమ తిప్పం అన్న ప్రభుత్వ నేతలు నేడు నాలుకలు మడత పెట్టి మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో నిరంకుశ పరిపాలన కొనసాగుతోందన్నారు. నరసాపురం – కోటిపల్లి రైల్వే లైన్ పనులకు కేంద్రం వాటా 75 శాతం నిధులు మంజూరు చేసినప్పటికీ.. రాష్ట్రం వాటా 25 శాతం విడుదల చేయకపోడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు.


Tags

Related News

Inquiry on Sakshi Newspaper: జగన్ చిక్కినట్టేనా.. క్విడ్ ప్రోకో, సాక్షి పత్రిక కొనుగోళ్లపై

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Big Stories

×