Purandeswari: బ్యాంకు నోటీసులపై కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. పాలకొల్లులో టిడ్కో ఇళ్ల సముదాయాన్ని పరిశీలించిన ఆమె లబ్దిదారులతో మాట్లాడారు. పాలకొల్లులో నిర్మించిన టిడ్కో ఇళ్లలో కనీస వసతులు కల్పించకుండా బాధితులకు ఇళ్లను ఇచ్చారన్నారు. మౌళిక వసతులు లేక బాధితులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
కేంద్ర ప్రభుత్వం జిల్లాకు లక్షా 5 వేలకు పైగా ఇల్లు మంజూరు చేస్తే వాటిలో ఎన్ని ఇల్లు నిర్మించి లబ్ధిదారులకు అందించారో జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు. ఆడుదాం ఆంధ్ర కాదని.. వైసీపీ ప్రభుత్వం ప్రజలతోనే ఆడుకుంటుందని విమర్శించారు.
మాట తప్పం ..మడమ తిప్పం అన్న ప్రభుత్వ నేతలు నేడు నాలుకలు మడత పెట్టి మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో నిరంకుశ పరిపాలన కొనసాగుతోందన్నారు. నరసాపురం – కోటిపల్లి రైల్వే లైన్ పనులకు కేంద్రం వాటా 75 శాతం నిధులు మంజూరు చేసినప్పటికీ.. రాష్ట్రం వాటా 25 శాతం విడుదల చేయకపోడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు.