NIA Most Wanted List: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ దూకుడు పెంచింది. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు యువకులు ఉన్నారు. జగిత్యాల జిల్లా ఇస్లాంపురాకు చెందిన అబ్దుల్ సలీం, నిజామాబాద్లోని మల్లేపల్లికి చెందిన ఎండీ అబ్దుల్ అహద్ అలియాస్ ఎంఏ అహద్, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం ఖాజానగర్కు చెందిన షేక్ ఇలియాస్ అహ్మద్ ఆచూకీ తెలపాలంటూ ప్రకటన విడుదల చేసింది.
ఇప్పటికే ఈ కేసులో దేశవ్యాప్తంగా పలువురిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారితో పాటు కేరళకు చెందిన 11 మంది, కర్నాటక కు చెందిన ఐదుగురు, తమిళనాడు చెందిన 5 మంది వ్యక్తులను మోస్ట్ వాంటెడ్గా NIA ప్రకటించింది. నిందితుల ఆచూకి తెలిపిన వారికి పారితోషికం ఇస్తామని ఎన్ఐఏ అధికారులు ప్రకటించారు.
.
.