Anantapur : అనంతపురం రూరల్ మండలం కురుగుంట సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అగివున్న సిమెంట్ లారీని ఐచర్ వాహనం ఢీ కొట్టింది .ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తికి గాయాలయ్యాయి.
అనంతపురం రూరల్ చిన్నంపల్లి క్రాస్ రోడ్డు సమీపంలో బండల లోడుతో వెళుతున్న లారీ టైరు పంక్చర్ కావడంతో రోడ్డు పై నిలిపారు. అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వెళుతున్న ఖాళీ ఐచర్ వాహనం వేగంగా వచ్చి లారీని వెనుక వైపు నుంచి ఢీ కొట్టాటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఐచర్ వాహనంలో ఉన్న నలుగురు వ్యక్తుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా సుభాష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన సుభాష్ ను పోలీసులు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు కర్ణాటకలోని హిరియారు ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.