Bandi Sanjay: కేసీఆర్ దేశం వదిలి పారిపోయే అవకాశం ఉందని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. వెంటనే కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతల పాస్పోర్టులను సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బంగారు పళ్లెంలో తెలంగాణను అప్పగించామని బీఆర్ఎస్ నేతలు చెప్పడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. రాష్ట్రం మొత్తాన్ని దోచుకొని ఆస్తులు కూడబెట్టుకోవడం తప్పా.. అభివృద్ది శూన్యం అని ఆరోపించారు.
అధికారం పేరిట కేసీఆర్ కుటుంబం సహా బీఆర్ఎస్ నాయకులు ప్రజల సొమ్మును దోచుకున్నారన్నారు. అవినీతి బాగోతాల బయటపడతయనే భయం వాళ్లలో ఉందన్నారు. తెలంగాణలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ,కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.