Ts assembly session: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో 412 హామీలు ఇచ్చి కేవలం ఆరు హామీల గురించి మాత్రమే మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రోజు ప్రజావాణి ఉంటుందని చెప్పి ఇప్పుడు వారంలో రెండు రోజులు మాత్రమే ప్రజావాణి నిర్వహిస్తున్నాన్నారు. అసెంబ్లీలో గవర్నర్ కాంగ్రెస్ హామీలు మాత్రమే చదివారన్నారు.
అప్పులను చూపించి హామీలను అమలు చేయకుండా ఉంటే సహించే ప్రసక్తే లేదన్నారు. హామీలు ఎలా అమలు చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. పన్నులు పెంచకుండా హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.