EPAPER

Balineni Srinivasa Reddy : టీడీపీతో టచ్ లో బాలినేని? త్వరలో వైసీపీకి గుడ్ బై..?

Balineni Srinivasa Reddy : టీడీపీతో టచ్ లో బాలినేని? త్వరలో వైసీపీకి గుడ్ బై..?

Balineni Srinivasa Reddy : సీఎం జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వైసీపీకి గుడ్‌బై చెప్పబోతున్నారా? ఒకసారి కంటతడి పెట్టి, మరోసారి ముఖ్యమంత్రిని కలిసి తనకు కంఫర్ట్‌గా లేదని పదేపదే చెప్తున్న బాలినేని ఈసారి పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారా? ఔననే సమాధానం వినిపిస్తోంది.


ఒంగోలు నియోజకవర్గం నుంచి బాలినేని ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఆయనకు ఈసారి ఒంగోలు టిక్కెట్ ఇవ్వరనే ప్రచారం జరుగుతోంది. గిద్దలూరు లేదంటే మార్కాపురం నుంచి పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం ఆయనకు సూచించినట్టు తెలుస్తోంది.

వైసీపీ అధిష్టాన వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బాలినేని టీడీపీకి టచ్‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో చంద్రబాబు నాయుడు కూడా బాలినేని విషయంలో సాఫ్ట్‌గా స్పందించారు. శుక్రవారం మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. వైసీపీ నుంచి ఎవరైనా వస్తే ఆలోచిస్తామన్నారు. బలమైన నేతలను పార్టీలో చేర్చుకుంటామనే సంకేతాలిచ్చారు.


మంత్రివర్గంలో మార్పులు చేసినప్పుడే బాలినేనికి వైసీపీకి మధ్య దూరం పెరిగింది. మంత్రి పదవి నుంచి తప్పించడంతో ఆయన అలిగారు. సీఎం జగన్ పిలుపించుకుని మాట్లాడినా ఆయన తరచూ తన అసంతృప్తిని వివిధ వేదికలపై వెళ్లగక్కుతూనే ఉన్నారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లాపై బాలినేనికి పార్టీలో మంచి పట్టుఉంది. కానీ వైసీపీ అధిష్టానం ఆయన ప్రాధాన్యతను తగ్గించడంత హర్ట్ అయ్యారు. ఇన్నాళ్లూ సరైన సమయం కోసం ఎదురుచూశారు. ఇప్పుడు తను పోటీ చేసే స్థానాన్ని మార్చే ప్రయత్నాలు జరగడంతో ఇక వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారని టాక్ వినిపిస్తోంది. అటు ఆయన వస్తే పార్టీలో చేర్చుకోవడానికి టీడీపీ సిద్ధంగా ఉంది. మరి నిజంగానే బాలినేని వైసీపీకి గుడ్ చెబుతారా? లేక పార్టీ ఆదేశాలను పాటిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.

.

.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×