Hyderabad : చిన్నతనం నుంచి పోలీసు కావాలని ఆ బాలుడి లక్ష్యం. అయితే చిన్న తనంలోనే అనారోగ్యానికి గురి అయ్యాడు. ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడ్డాడు. అయితే ఆ పసివాడి కల మాత్రం నెరవేరింది.
గుంటూరుకి చెందిన మోహన్ సాయి గతేడాది క్యానర్స్ బారిన పడ్డారు. ఎన్నో ఆస్పత్రులు తిరిగారు. చివరికి వైద్యం కోసం హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే ప్రస్తుతం ఆ బాలుడు చికిత్స పొందుతున్నాడు. ఆ పసివాడి చివరి కోరికను ఆస్పత్రి సిబ్బంది తెలుసుకున్నారు. మేక్ ఏ విష్ ఫౌండేషన్ సంప్రదించారు. ఆ బాలుడి పరిస్థితిని వివరించారు. ఆ బాలుడి కోరికను తీర్చారు.
మేక్ ఏ విష్ ఫౌండేషన్ బాలుడిని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లింది. పోలీసు సిబ్బంది మోహన్ సాయిని సాదరంగా ఆహ్వానించారు. పోలీసు పోలీసు అధికారిగా సీట్లో కూర్చోబెట్టారు. పోలీసు డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ జాకీర్ హుస్సేన్ చిన్నారికి గౌరవం వందనం చేశారు. అలానే స్టేషన్లో జరిగే ప్రక్రియలను, పోలీసులు విధులను వివరించారు. ఆ పసివాడికి బహుమతునలను అందజేశారు. కాన్సర్ తో పోరాటం చేస్తున్న మోహన్ సాయి కోరికను మేక్ ఏ విష్ ఫౌండేషన్ తీర్చింది.