వైసీపీలో నియోజకవర్గ ఇంఛార్జ్ల మార్పుపై సెటైర్లు వేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. 150 మందిని మార్చినా వైసీపీకి అధికారం దక్కదని విమర్శించారు. ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు చంద్రబాబు. మునిగిపోయే పడవ వైసీపీ అన్నారు చంద్రబాబు నాయుడు.
ప్రజల అభిప్రాయం మేరకు తమ పార్టీ టికెట్లు ఇస్తుందన్నారు చంద్రబాబు నాయుడు. కుప్పంలోనూ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామన్నారు. ఇందుకోసం కొత్త టెక్నాలజీ వినియోగిస్తామని చెప్పారాయన. వైసీపీ నేతలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఎవరైనా టీడీపీలో చేరతామంటే పరిశీలన చేస్తామంటూ డోర్లు తెరిచారు.
వైసీపీలో నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ల మార్పు ఆ పార్టీలో అలజడి రేపింది. ఇప్పటికే మంగళిగిరి ఎమ్మెల్యే పార్టీకి, పదవికి కూడా రాజీనామా చేశారు. మరికొందరు నేతలు తమకు స్థానచలనం కల్పించడంపై అలిగారు. ఇంకొందురు నేతలు వైసీపీకి షాకిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు ఇచ్చిన ఓపెన్ ఆఫర్ ఆసక్తిగా మారింది.