పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం కొమరాడలో పంట పొలాలలో రైతులు పడవలు ఉపయోగించవలసిన పరిస్థితి ఏర్పడింది. మిగ్ జామ్ తుఫాన్ వచ్చి వారం రోజులు దాటినా పంట పొలాలలో నీరు తగ్గకపోవడంతో రైతులకు పడవలే శరణ్యమయ్యాయి. చేపలు, రొయ్యల చెరువులలో మందులు కొట్టేందుకు ఐరన్ పడవలు ఉపయోగిస్తారు. ఇప్పుడు ఇవి పంట పొలాల్లో రైతులకు ఉపయోగపడుతున్నాయి.
రాష్ట్ర టీడీపీ కార్య నిర్వాహణ కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు కొమరాడలో పూర్తిగా నీట మునిగిన వరి చేలను రైతులతో కలసి పరిశీలించారు. రైతులు వరి కోసి, వరి పనలను పడవల ద్వారా వడ్డుకు చేరుస్తున్నారని తెలిపారు. పంటలు మునిగిపోయినా వైసీపీ ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధానాలో ఆదుకోవాలని కోళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.