AP CS: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. సెక్రటేరియెట్ లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తుండగాద ఉన్నట్టుండి పక్కకు వాలిపోయారు. వెంటనే స్పందించిన సిబ్బంది.. సీఎస్ ను హుటాహుటిన మణిపాల్ హాస్పిటల్ కు తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియాల్సి ఉంది.
సీఎస్ సమీర్ శర్మ ఇటీవల ఇలానే సడెన్ గా సిక్ అయ్యారు. అప్పుడు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. గుండె సంబంధిత సమస్యగా గుర్తించి ఆపరేషన్ చేశారు. చికిత్స అనంతరం సమీర్ శర్మ ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆయన యధావిధిగా విధులకు హాజరవుతున్నారు. తాజాగా అధికారులతో రివ్యూ జరుపుతుండగా.. మరోసారి అస్వస్థతకు గురై.. పక్కకు వాలిపోవడం ఆందోళనకరంగా మారింది.