బోలేరో వావానం , బైక్ ఢీ కొనడంతో తండ్రి, కుమారుడు అక్కడక్కడే మృతిచెందారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బురు-తోకపల్లి హైవే పై రోడ్డులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని.. మృతదేహాలను మార్కాపురం ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు.
మృతులు కురిచేడు మండలం నాయుడు పల్లి పంచాయతీ సంఘం గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. స్వగ్రామం నుండి మార్కాపురం వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. ఫోన్ మాట్లాడుతూ బైక్ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.