Uttam Kumar Reddy: తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఎంపీ పదవికీ రాజీనామా చేశారు. 2018 ఎన్నికలో హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత గత లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు.
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రిగా బాద్యతలు చేపట్టారు. దీంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా డిల్లీకి వెళ్లిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తన సతీమణి ఎమ్మెల్యే పద్మావతి తో కలిసి 10 జన్ పథ్ వద్ద కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.