EPAPER

India vs South Africa : ఆ ముగ్గురిని ఎందుకు ఆడించలేదు ? సూర్యాపై సీనియర్ల గుర్రు..

India vs South Africa : ఆ ముగ్గురిని ఎందుకు ఆడించలేదు ? సూర్యాపై సీనియర్ల గుర్రు..
India vs South Africa

India vs South Africa : సౌతాఫ్రికా గడ్డపై టీమ్ ఇండియా టీ 20 మ్యాచ్ ఓడిపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. నెంబర్ వన్ బౌలర్ ని కాదని ఇవేం ప్రయోగాలు అంటూ సీనియర్లు గుస్సా అవుతున్నారు. మరి కెప్టెన్ సూర్య కుమార్ ఏం నోరు విప్పి, టీమ్ మేనేజ్మెంట్ కి చెప్పడం లేదా? అని అడుగుతున్నారు.


ముఖ్యంగా ఆ ముగ్గురిని ఎందుకు ఆడించలేదని కోప్పడుతున్నారు. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరంటే శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్ వీరిని ఆడించకపోవడం ఆత్మహత్యా సదృశ్యమే అంటున్నారు. టీ 20 వరల్డ్ కప్ ముందు టీమ్ ఇండియా కేవలం 5 మాత్రమే టీ 20 మ్యాచ్ లు ఆడనుంది.

ఇప్పుడు ఆల్రెడీ ఒకటి అయిపోయింది. ఇంక నాలుగే ఉన్నాయని అంటున్నారు.  అంత మెగా టోర్నమెంట్ ముందు అంతర్జాతీయ పిచ్ లపై ఇవేం ప్రయాగాలని మండిపడుతున్నారు.


ముఖ్యంగా గౌతమ్ గంభీర్ అయితే, శ్రేయస్ ను పక్కన పెట్టడం అర్థం కాలేదని అన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20లో అతడు హాఫ్ సెంచరీ చేయడం వల్లనే కదా, మ్యాచ్ గెలిచిందని గుర్తు చేశాడు.

లెఫ్ట్ హ్యాండర్ కోసమని తప్పించారా? లేక శ్రేయాస్ కు గాయమైందా?  ఏం జరిగిందనేది ప్రపంచానికి తెలియాలి. లేకపోతే రకరకాలుగా మాట్లాడతారని అన్నాడు. ఇక నంబర్ వన్ బౌలర్ రవి బిష్ణోయ్ ను తుదిజట్టు నుంచి తప్పించారు. ఎందుకో తెలీదని అన్నాడు.

ఇక సంజయ్ మంజ్రేకర్ మాట్లాడాడు.. ”ఫస్ట్ డౌన్ లో శ్రేయస్ బదులుగా తిలక్ వర్మ వచ్చాడు. వన్డే వరల్డ్ కప్ లో టీమిండియాలో ఆరుగురు కుడిచేతి వాటం బ్యాట్స్ మెన్ ఉన్నారు. కానీ సౌతాఫ్రికా రెండో టీ20 మ్యాచ్ లో ఒకరు లెఫ్ట్, మరొకరు రైట్ ఇలా చూసుకున్నారు.

ఇదే భారత్ బ్యాటింగ్ టైనప్ లో లోపించిందని అన్నాడు.  అన్ని ఫార్మాట్లలో మార్పు కోసం ప్రయత్నించడం తప్పులేదని అన్నాడు. కానీ శ్రేయస్, రుతురాజ్ జట్టులో లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది” అని మంజ్రేకర్ వివరించాడు.

పీయుష్ చావ్లా మాట్లాడుతూ.. ”ఆస్ట్రేలియా సిరీస్ లో రవి బిష్ణోయ్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ లో నిలిచాడు. అతడిని ఎంపిక చేయకుండా బెంచ్ మీద కూర్చోబెట్టడం సరైనది కాదని అన్నాడు.  ఇది జట్టుపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని అన్నాడు.

ఇలా జట్టు కూర్పుపై సీనియర్లు విమర్శించారు. మ్యాచ్ ఓడిపోయింది కేవలం, ఆటగాళ్ల ఎంపిక వల్ల, సమతూకం లేకపోవడం వల్లనేనని అంతా అనుకుంటున్నారు. కాకపోతే శ్రేయాస్, రుతురాజ్, రవి బిష్ణోయ్ వీరందరూ ప్రూవ్ చేసుకున్నారు.

ఇక మిగిలిన వారిని చూడాలి. అలాగే ఎక్కువ టీ20 మ్యాచ్ లు లేవని, అందుకే మిగిలిన వారిని టెస్ట్ చేస్తున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Related News

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

IPL 2025: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్​ అతడే..రోహిత్‌, పాండ్యా ఔట్‌?

Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్.. వారితో సమానంగా.. ప్రైజ్ మనీ

Kohli Vs Gambhir: ఐపీఎల్‌ లో తన్నుకున్నారు..ఇప్పుడు వాళ్లే టీమిండియాలో చీలిక తెచ్చారు..ప్రోమో అదుర్స్‌ !

Ind Vs Ban: 3 మార్పులతో బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ కు టీమిండియా రెడీ..ఫ్రీగా మ్యాచ్‌ ఎలా చూడాలంటే..?

Yashasvi Jaiswal: యశస్వి జైశ్వాల్ ముంగిట.. అద్భుత రికార్డ్

IND vs PAK: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ లో భారీ మార్పులు.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

Big Stories

×