BJP politics on Nehru | భారతదేశ విభజన జరిగిన వెంటనే జమ్మూ కాశ్మీర్ రాజు మొండి ఘటమై కూర్చున్నాడు. ఇదే, నాటి పరిస్థితులను కఠినతరం చేసిందనే అభిప్రాయం ఉంది. అసలు కాశ్మీర్ సమస్యను లేవనెత్తిందే నాటి బ్రిటీష్ పాలకులు. సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్లతో ఉన్న విభేదాలకు పాకిస్థాన్ను వాడుకోడానికి బ్రిటీష్ పాలకులు పన్నిన పన్నాగం ఈ కాశ్మీర్ వివాదం. వీళ్లంద్దరూ చేసిన కుట్రకు నెహ్రూను బలి చేయడం ఎంత వరకూ సమంజసం… ఇదే ఇప్పుడు కాంగ్రెస్ వాదులు అడుగుతున్న ప్రశ్న…?
భారతదేశ విభజన జరిగిన వెంటనే జమ్మూ కాశ్మీర్ రాజు మొండి ఘటమై కూర్చున్నాడు. ఇదే, నాటి పరిస్థితులను కఠినతరం చేసిందనే అభిప్రాయం ఉంది. అసలు కాశ్మీర్ సమస్యను లేవనెత్తిందే నాటి బ్రిటీష్ పాలకులు. సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్లతో ఉన్న విభేదాలకు పాకిస్థాన్ను వాడుకోడానికి బ్రిటీష్ పాలకులు పన్నిన పన్నాగం ఈ కాశ్మీర్ వివాదం. వీళ్లంద్దరూ చేసిన కుట్రకు నెహ్రూను బలి చేయడం ఎంత వరకూ సమంజసం… ఇదే ఇప్పుడు కాంగ్రెస్ వాదులు అడుగుతున్న ప్రశ్న…?
జూన్ 3, 1947న విభజన ప్రణాళికను ప్రకటించిన వెంటనే మహారాజా హరి సింగ్తో జమ్మూ, కాశ్మీర్ రాష్ట్ర భవిష్యత్తు సమస్యను లేవనెత్తిన మొదటి వ్యక్తి లార్డ్ మౌంట్ బాటన్ అనేది చారిత్ర చెబుతోంది. మౌంట్ బాటన్ హరి సింగ్కు స్వాతంత్ర్యం ప్రకటించవద్దని, తన డిమాండ్లను నిర్ధారించుకోవడానికి మార్గాన్ని కనుక్కోవాలని చెప్పాడు. ఎందుకంటే, కాశ్మీర్ను పాకిస్తాన్లో విలీనం చేస్తే, ఇది స్నేహపూర్వక చర్యగా పరిగణించబడదని కొత్తగా ఏర్పడిన రాష్ట్ర శాఖ సిద్ధంగా ఉందని ఆయన తెలిపినట్లు సమాచారం. అయితే, సదరు రాష్ట్ర శాఖకు నేతృత్వం వహించింది సర్దార్ వల్లభాయ్ పటేల్. కాశ్మీర్ సమస్య మరింత ఆలస్యం చేయకుండా భారత యూనియన్, దాని రాజ్యాంగ అసెంబ్లీలో కాశ్మీర్ను చేర్చాలని జూలై 3, 1947న, వల్లభాయ్ పటేల్… హరి సింగ్కు ప్రతిపాదించారు. అయితే, మహారాజులో ఉన్న భయాందోళనలను పోగొట్టడానికి పటేల్…. నెహ్రూ కాశ్మీరీగా ఉన్నందుకు గర్వపడ్డారని, నెహ్రూ హరిసింగ్కు ఎప్పటికీ శత్రువుగా ఉండడని తెలిపాడు. ఈ తరుణంలోనే, మౌంట్ బాటన్ తన చర్చలకు పూర్తిగా భిన్నమైన రూపాన్ని ఇస్తూ…, జూన్ 24, 1947న జవహర్లాల్ నెహ్రూతో మాట్లాడిన సందర్భంలో… పాకిస్తాన్ రాజ్యాంగ సభ ఏర్పాటు అయ్యి, అందులో స్పష్టత కనిపించే వరకు ఏ రాజ్యాంగ సభలోనూ కాశ్మీర్ చేరడంపై నిర్ణయం తీసుకోవద్దని హరి సింగ్కు చెప్పానని చెప్పాడు. అలాగే, మధ్యంతర కాలంలో హరిసింగ్ స్వాతంత్ర్యం ప్రకటించవద్దని, రెండు కొత్త రాష్ట్రాలతో “నిశ్చింత” ఒప్పందం కుదుర్చుకోవద్దని కూడా ఆయన సూచించినట్లు చెప్పారు. అయితే, మహారాజు చేసినది వేరు. హరి సింగ్ పాకిస్తాన్తో ఒప్పందంపై సంతకం చేశాడు. అదే సమయంలో కాశ్మీర్ విషయమై భారతదేశంతో చర్చకు దూరంగా ఉన్నాడు.
ఏది ఏమైనప్పటికీ, నెహ్రూ 1946 జూన్ 17న, శ్రీనగర్కు బయలుదేరే ముందు మౌంట్బాటన్కు ఒక నోట్ ఇచ్చారు, అందులో అతను స్పష్టంగా “నేషనల్ కాన్ఫరెన్స్ కాశ్మీర్ భారత రాజ్యాంగ అసెంబ్లీలో చేరడానికి సుమఖంగా ఉంది” అని చెప్పాడు. తర్వాత, మౌంట్ బాటన్ చాలా అయిష్టంగానే ఆగస్టులో గాంధీని అక్కడికి వెళ్ళడానికి అనుమతించాడు. గాంధీ అక్కడ ఉన్న సమయంలో ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొననని హామీ ఇచ్చిన తర్వాత మాత్రమే గాంధీ పర్యటనకు అనుమతి వచ్చింది. అయితే, అప్పటికి ఖైదులో ఉన్న షేక్ అబ్దుల్లాను సెప్టెంబరు 29, 1947న మహారాజా విడుదల చేసిన వెంటనే, కాశ్మీర్ను పాకిస్తాన్లో విలీనం చేయడానికి మద్దతు ఇవ్వమని జిన్నా చేసిన ప్రతిపాదనను షేక్ అబ్దుల్లా తిరస్కరించారు. ఆగష్టు 14న పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని స్వతంత్రంగా ఉంచాలనే మహారాజా గేమ్ ప్లాన్ పారలేదు. జిన్నా పాకిస్తాన్లో చేరడానికి మహారాజాతో మధ్యవర్తుల ద్వారా విధానాలను రూపొందించాడు. కానీ విజయం సాధించలేదు. ఈ క్రమంలోనే… రాష్ట్రంలోని ముస్లిం నాయకత్వంలో షేక్ అబ్దుల్లాతో జిన్నా సంబంధాన్ని పెంచుకోలేకపోయాడు. ఎందుకంటే, జిన్నా మాత్రమే ముస్లింల ఏకైక ప్రతినిధిగా ఉండాలని కోరుకున్నాడు. షేక్ అబ్దుల్లాలా కాకుండా మతాన్ని జాతీయతకు ఆధారం అని నమ్మినవాడు జిన్నా. మతపరమైన అనుబంధం, భౌగోళిక స్థానం, ఆర్థిక కనెక్టివిటీని దృష్టిలో ఉంచుకుని కాశ్మీర్ ఎప్పటికైనా పాకిస్థాన్లో భాగం అవుతుందని జిన్నా నమ్మాడు.
ఇక, పాకిస్తాన్ దగ్గరున్న ఏకైక ప్రత్యామ్నాయం బలప్రయోగం. సెప్టెంబరు 1947లో, పాకిస్తాన్ రాష్ట్రానికి అవసరమైన ఆహారం, పెట్రోలు, దుస్తుల సరఫరాలను మొదట నిరోధించింది. తర్వాత అక్టోబర్ 22న రాష్ట్రాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి గిరిజన రైడర్లను పంపింది. రైడర్ల చేతిలో తన రాష్ట్రాన్ని కోల్పోతామనే భయం మహారాజును పట్టుకుంది. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్పై సంతకం చేసి భద్రత కోసం జమ్మూకి వెళ్లిపోయారు. భారతదేశం అక్టోబరు 26న అక్సెషన్ ఇన్స్ట్రుమెంట్ను ఆమోదించింది. అది రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్ వంటి మూడు విషయాలను హామీ ఇచ్చింది. అదే సమయంలో, మహారాజా అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు షేక్ అబ్దుల్లాను అత్యవసర నిర్వాహకుడిగా నియమించవలసి వచ్చింది. దీనితో, జిన్నా ఆగ్రహానికి గురయ్యాడు. పాకిస్తాన్ సైన్యం శ్రీనగర్ వైపు కవాతు చేయాలని కోరుకున్నాడు. కానీ దానిని అమలు చేయలేకపోయాడు. ఆ సమయంలో బ్రిటీష్ అధికారుల నేతృత్వంలోని దళం ఉంది. వారు ఆర్డర్ను ఉపసంహరించుకోకపోతే వైదొలుగుతామని బెదిరించారు.
ఆ తర్వాత, మొదటిసారిగా, లాహోర్లో నవంబర్ 1, 1947న భారత గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్, పాకిస్తాన్ గవర్నర్ జనరల్ మొహమ్మద్ అలీ జిన్నాతో జరిగిన సమావేశంలో భారతదేశం ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ ప్రతిపాదన చేయబడింది. అయితే, దీనిని వెంటనే తిరస్కరించారు. తర్వాత ఇద్దరు గవర్నర్ జనరల్ల పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణకు జిన్నా కౌంటర్ ఆఫర్ ఇచ్చారు. కాగా, ఇది భారతదేశానికి ఆమోదయోగ్యం కాలేదు. షేక్ అబ్దుల్లా అధికారంలో ఉండటం వల్ల, రాష్ట్రంలోని ముస్లింలు ఏ ప్రజాభిప్రాయ సేకరణలోనైనా పాకిస్తాన్కు ఓటు వేయరని భారతదేశం నమ్మింది. తర్వాతి, పరిణామంలో… భారత ప్రధాని నెహ్రూ, పాక్ ప్రధాన మంత్రి లియాఖత్ అలీ ఖాన్ మధ్య అనేక ఉత్తరప్రత్యుత్తరాల మార్పిడి జరిగింది. రెండు సమావేశాల తర్వాత, పాకిస్తాన్తో దౌత్యపరంగా సమస్యను పరిష్కరించుకోవాలనే ఆశ చాలా తక్కువగా ఉందని భారతదేశం గ్రహించింది. సైనికపరంగా, పాకిస్తాన్ గుండా వెళుతున్న ఆక్రమణదారుల సరఫరా మార్గాలపై దాడి చేయడం అవసరమని భావించింది. దీనితో రెండు ఆధిపత్యాల మధ్య యుద్ధం అనివార్యమయ్యింది.
అయితే, బ్రిటన్ దాని పూర్వపు రెండు కాలనీల మధ్య ఇటువంటి శత్రుత్వాలకు విముఖంగా ఉంది. బ్రిటన్ తమ కొత్త శత్రువు, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్లతో సరిహద్దును కోల్పోతుందని, హిందూ మహాసముద్రంపై వ్యూహాత్మక నియంత్రణను కోల్పోతుందని భయపడింది. జమ్ము కాశ్మీర్లో దూకుడును విరమించుకోవడానికి బ్రిటన్ పాకిస్థాన్పై తన ప్రభావాన్ని ఉపయోగించాలని భారతదేశం ఆశించింది. అయితే, అప్పటి యునైటెడ్ కింగ్ డమ్ ప్రధాని క్లెమెంట్ అట్లీ జోక్యం చేసుకోవడానికి నిరాకరించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి “సరైన ఛానెల్” అయిన ఐక్యరాజ్యసమితిపై ఆధారపడాలని నెహ్రూకు సూచించారు. ఇక, ఎటువంటి అవకాశం లేని సమయంలో, జనవరి 1, 1948న భారతదేశం ఐక్యరాజ్య సమితికి అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఆక్రమణదారులు భారత భూభాగాన్ని ఉపయోగించడాన్ని నిరాకరించాలని, సైనిక, ఇతర మద్దతును అందించకుండా… పాకిస్తాన్ సైనిక, పౌర సిబ్బంది కాశ్మీర్పై దండయాత్రలో పాల్గొనకుండా నిరోధించాలని పాకిస్తాన్కు ఆదేశాలు ఇవ్వాలని ఇండియా డిమాండ్ చేసింది. దీనితో… 1947 నాటి కాశ్మీర్ సంఘర్షణకు, రాష్ట్ర విభజనకు ముగ్గురు ప్రధాన దోషులుగా మారిన వారిలో లార్డ్ మౌంట్ బాటన్, మహమ్మద్ అలీ జిన్నా, పాకిస్తాన్ గవర్నర్ జనరల్, మహారాజా హరి సింగ్లు కారణం తప్ప, జవహర్లాల్ నెహ్రూ బాధ్యత వహించరని విశ్లేషకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మరో వైపు, ఆ సమయంలో భారత్ వైపు కీలక పాత్ర పోషించిన ముగ్గురు పెద్ద నాయకుల్లో షేక్ అబ్దుల్లా, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారు. వీరి దగ్గర ఎలాంటి ప్రత్యామ్నాయం లేని తరుణంలో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇదే చరిత్ర చెబుతున్న అస్సలు నిజం.
తరువాయి భాగం క్లిక్ చేయండి