Narsapuram : పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలో అంగన్ వాడీ వర్కర్స్ నిరసన చేశారు. న్యాయమైన తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్ వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ లో టెంట్ వేసి నిరసన తెలిపారు. సీఎం జగన్ తమకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని కోరారు. తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని సుచించారు. పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున అంగన్ వాడీ వర్కర్స్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.