Medchal : ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఫొటో గ్రాఫర్ అజయ్ అనే ఓ వ్యక్తి తన స్నేహితులతో హనుమకొండలో వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఆ తర్వాత అజయ్ తన స్నేహితులతో కారులో TS 26 H 3777 హైదరాబాద్ కు బయలుదేరారు.
యాద్గార్ పల్లి చౌరస్తాలో కారు చెట్టును ఢీ కొట్టింది. కారులో ఆరుగురు ఉన్నారు. వారిలో అజయ్ అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన ఫొటో గ్రాఫర్స్ నల్గొండ జిల్లా రామన్నపేట్ ప్రాంతానికి చెందిన వారీగా గుర్తించారు.