EPAPER

Chandrababu Fibernet Case | ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ వాయిదా

Chandrababu Fibernet Case | ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జనవరి 17 కి వాయిదా పడింది. ముందస్తు బెయిల్ పై విచారించిన సుప్రీం కోర్టు ధర్మాసనం.. కీలక సూచనలు చేసింది. కేసుకు సంబంధించిన అంశాలపై ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దంటూ ప్రభుత్వానికి,చంద్రబాబుకు సూచించింది. ఈ విషయంలో ఇరు వర్గాలు సంయమనం పాటించాలని ఆదేశించింది.

Chandrababu Fibernet Case | ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ వాయిదా

Chandrababu Fibernet Case | ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జనవరి 17 కి వాయిదా పడింది. ముందస్తు బెయిల్ పై విచారించిన సుప్రీం కోర్టు ధర్మాసనం.. కీలక సూచనలు చేసింది. కేసుకు సంబంధించిన అంశాలపై ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దంటూ ప్రభుత్వానికి,చంద్రబాబుకు సూచించింది. ఈ విషయంలో ఇరు వర్గాలు సంయమనం పాటించాలని ఆదేశించింది.


కేసు విషయాలపై బహిరంగంగా చంద్రబాబు నాయడు మాట్లాడుతున్నారంటూ ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసుపై ఆయన బహిరంగంగా మాట్లాడకుండా ఆంక్షలు విధించాలని న్యాయవాది సుప్రీం ధర్మాసనాన్ని కోరారు.

చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కూడా తన వాదనలు వినిపించారు. కోర్టు నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడలేదని సుప్రీంకోర్టుకు తెలిపారు. పైగా ప్రభుత్వం తరపునే ఢిల్లీ సహా పలు చోట్ల అదనపు ఏజీ, సీఐడీ డీజీ ప్రెస్ మీట్లు పెట్టి కేసు గురించి ప్రస్తావించారన్నారు. ఇలా మీడియా సమావేశాలు నిర్వహించడం పూర్తిగా తప్పు అని చెప్పారు.


ప్రెస్ మీట్లు పెట్టి ఆధారం లేకుండా ఆరోపణలు చేశారని.. కానీ చంద్రబాబు ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చంద్రబాబు న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. ఇద్దరినీ సంయమనం పాటించాలని కోరుతూ.. జనవరి 17కి విచారణ వాయిదా వేసింది.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×