TSPSC ఛైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా వ్యవహారంలో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఆయన రాజీనామాను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించలేదు. పేపర్ లీకేజీలకు బాధ్యుడు అంటూ DoPTకి ఆమె లేఖ రాసినట్టు చెప్తున్నారు. మరోవైపు.. పేపర్ లీకేజీలకు బాధ్యులెవరో తేల్చకుండా జనార్దన్ రెడ్డి రాజీనామాను ఆమోదించకూడదని గవర్నర్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
TSPSC చైర్మన్ జనార్థన్ రెడ్డి నిన్న రాత్రి తన పదవికి రాజీనామా చేశారు. టీఎస్పీఎస్సీ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చిన కాసేపటికే జనార్థన్ రెడ్డి రాజీనామా చేశారు. అంతకు ముందు TSPSCపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. రెండు రోజుల్లో పూర్తి వివరాలతో రావాలని జనార్ధన్ రెడ్డిని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన రోజు నుంచి ఇప్పటివరకు భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలు, పెండింగ్ నోటిఫికేషన్ల వివరాలతో రావాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ సమీక్ష ముగిసిన కొద్దిసేపటికే TSPSC చైర్మన్ జనార్థన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.