Mogalturu : ఎదురుగా వస్తున్న ట్రక్కు ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు.మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ప్రమాదం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం దార తిప్ప గ్రామంలో 216 జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మొగల్తూరు పోలీసులు ఘటన స్థాలానికి చేరుకొని గాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం..నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం వెలగదురు గ్రామానికి చెందిన ఎల్లమెల్లి రవి కుమార్(30), పోలిమాటి శ్రీనుబీ( 40), వీరబాబు(35) ఆటోలో కోళ్ల మేతతో రేపల్లె వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మొగల్తూరు ఎస్సై వీరబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.