Central Funds : ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీపై కేంద్రం స్పందించింది. గత ఐదేళ్లలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక ప్యాకేజి ఇవ్వలేదని వెల్లడించింది. కోవిడ్-19 దృష్ట్యా మూలధన వ్యయంలో రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించే పథకాన్ని కేంద్రం అమలు చేసింది. ఇందులో భాగంగా 50 ఏళ్లలో తిరిగి చెల్లించేలా వడ్డీ లేని రుణాన్ని సమకూర్చింది.
ఈ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2020-21లో రూ. 688 కోట్లు, 2021-22లో 501.79 కోట్లు, 2022-23లో 6105.56 కోట్లు కేంద్రం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రానికి 2020-21లో రూ. 358 కోట్లు, 2021-22లో 214.14 కోట్లు, 2022-23లో 2500.98 కోట్లు విడుదల అయ్యాయి.