CM Revanth Reddy : సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల హామీలపై దృష్టి సారించారు. 6 గ్యారెంటీ స్కీంలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ మేరకు సెక్రటేరియట్లో రైతు భరోసాపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, శ్రీధర్బాబుతోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
అయితే.. రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు 15 వేల రూపాయలు.. అలాగే వ్యవసాయ కూలీలకు 12 వేలు, వరి పంటకు బోనస్గా 500 ల రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. దీంతో పథకంపై సాధ్యాసాధ్యాలను సమీక్షలో చర్చిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.