Fire Accident : హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్దేవ్పల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. టాటానగర్లోని ఓ ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్నఅగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. 4 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. దాదాపు నాలుగు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
కాగా.. ప్రమాదంలో మంటలతోపాటు దట్టంగా పొగ వ్యాపించడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. గోదాంలో ఎవ్వరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.