EPAPER

Yuvagalam: యువగళం @3000 కిలోమీటర్లు.. గుంటూరులో 3వేల ఆటోలతో భారీ ర్యాలీ

Yuvagalam: యువగళం @3000 కిలోమీటర్లు.. గుంటూరులో 3వేల ఆటోలతో భారీ ర్యాలీ

Yuvagalam: టీడీపీ యువనేత నారా లోకేష్ ఈ ఏడాది జనవరిలో మొదలుపెట్టిన యువగళం పాదయాత్ర 218వ రోజుకు చేరింది. ఆదివారం తుని అసెంబ్లీ నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. తుని నియోజకవర్గంలో చేసిన పర్యటనతో.. యువగళం పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తవ్వడంతో గుంటూరులో 3 వేల ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులోని శిల్పారామం నుంచి అమరావతి రోడ్డు వరకూ టీడీపీ నేత మన్నవ మోహనకృష్ణ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు.


ఈ సందర్భంగా మోహనకృష్ణ మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్రకు రాష్ట్రవ్యాప్తంగా అన్నివర్గాల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందన్నారు. యువగళానికి రాష్ట్రప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించినా పట్టుదలతో ముందుకెళ్తూ.. యాత్రను కొనసాగిస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ ప్రభంజనం ఖాయమన్నారు.

ఆదివారం ఒంటిమామిడి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభమవ్వగా.. లోకేష్ ఒంటిమామిడి జంక్షన్లో మత్స్యకారులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత తొండంగి హనుమాన్ జంక్షన్ లో రైతులతో సమావేశమయ్యారు. శృంగవృక్షంలో ఎస్సీ సామాజిక వర్గీయులను కలిసి లంచ్ బ్రేక్ తీసుకున్నారు. మధ్యాహ్నం కాకినాడ సెజ్ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.


Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×