Tollywood Heroines : హీరోయిన్లు ఎన్ని ట్రెండీ ఔట్ఫిట్లు ధరించినా.. చీర లేదా లంగా ఓణీలో కనిపిస్తే.. ఆ కిక్కే వేరబ్బా. ఫ్యాన్స్ కూడా అలా చూస్తూ మైమరచిపోతారు.ఈ సందర్భంగా.. ఇలీవల సినిమాల్లో లంగా ఓణీలో ఆకట్టుకున్న హీరోయిన్లెవరో చూద్దాం.
సమంత
రామ్ చరణ్ హీరోగా రూపొందిన ‘రంగస్థలం’ సినిమాలో సమంత రామలక్ష్మీ పాత్రలో ఇలా సందడి చేసింది. పాత్రకు తగ్గటు సమంత యాస కూడా మార్చుకోవడం ఈ సినిమాకు హైలెట్.
సాయి పల్లవి
నేచురల్ బ్యూటీ.. సాయి పల్లవి ఎంపిక చేసుకునే పాత్రలన్నీ లంగా ఓణీలతో ముడిపడి ఉంటాయి. నాగ చైతన్య లవ్స్టోరీ చిత్రంలో మౌనికగా, రానా విరాటపర్వంలో వెన్నెలగా ఆకట్టుకుంది.
పూజ హెగ్డే
మెగా హీరో వరుణ్ తేజ్ కథానాయకుడిగా వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో పూజాహెగ్డే శ్రీదేవి అలియాస్ దేవి పాత్రలో.. ఇలా అచ్చం తెలుగు అమ్మాయిలా మెప్పించింది.
రష్మిక మందన్నా
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’: ది రైజ్’ లోని శ్రీవల్లి పాత్రలో రష్మిక లుక్ ఇది. ‘పుష్ప: ది రూల్’ లోనూ ఆమె లంగా ఓణిలో కనిపించనుంది.