Train Accident : యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీనగర్ వద్ద సిర్పూర్-కాగజ్నగర్ (125757) రైలులో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. నడుస్తున్న రైలులో పొగలు రావడంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్.. రైలును బీబీనగర్ స్టేషన్లో నిలిపివేశాడు. రైలులో ఉన్న ప్రయాణీకులను హుటాహుటిని కిందకు దింపేశారు రైల్వే అధికారులు.
రైలు బ్రేక్ లైనర్స్ పట్టేయడంతోనే పొగలు వ్యాపించినట్లు గుర్తించి.. సాంకేతిక లోపాన్ని సరి చేసి రైలును తిరిగి యధావిధిగా పంపారు రైల్వే అధికారులు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణీకులు, రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.