Kartheeka Masam : ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. కార్తీకమాసం చివరి రోజులు.. వరుసగా సెలవులు రావడంతో భారీగా భక్తులు మల్లన్న క్షేత్రానికి చేరుకున్నారు. భక్తుల రద్దీ పెరిగి పోతుండడంతో ఉచిత దర్శనానికి 6 గంటల సమయం.. ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు.
ఈ క్రమంలోనే మహిళా భక్తులు వేకువజామునే పుణ్య స్నానాలు ఆచరించి కార్తీకదీపం వెలిగిస్తున్నారు. దర్శనార్థమై క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, మంచినీరు అందిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించి.. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఈవో పెద్దిరాజు అధికారులకు సూచించారు.