Robbery at Govt office | తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత… పాత సర్కారుకు సంబంధించి కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఏకంగా పలు శాఖల్లో ఫైల్లకు ఫైల్లే మాయమవుతున్న పరిస్థితి నెలకొని ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. అలాంటి సంఘటనే తాజాగా వెలుగు చూసింది.
Robbery at Govt office | తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత… పాత సర్కారుకు సంబంధించి కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఏకంగా పలు శాఖల్లో ఫైల్లకు ఫైల్లే మాయమవుతున్న పరిస్థితి నెలకొని ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. అలాంటి సంఘటనే తాజాగా వెలుగు చూసింది.
హైదరాబాద్ మాసబ్ట్యాంక్ పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ అదృశ్యమయ్యాయి. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కల్యాణ్ ఆఫీస్లో ఉన్న ఫైల్స్ మాయమయ్యాయి. కిటికీల గ్రిల్స్ తొలగించి ఫైల్స్ ను దుండగులు ఎత్తుకెళ్లారని చెబుతున్నారు. దుండగులు ఎత్తుకెళ్లిన ఫైల్స్ లో చాలా కీలకమైన ఫైల్స్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఓఎస్టీ కల్యాణ్, ఆపరేటర్ మోహన్ ఎలిజ, వెంకటేష్, ప్రశాంత్లపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ కార్యాలయంలో ఫైల్స్ ఎత్తుకెళ్లారు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం నుంచి ఫైల్స్ తస్కరించారు. విషయం తెలుసుకుని అక్కడికి మీడియా చేరుకునేలోపు.. ఉడాయించే ప్రయత్నం చేశారు. ఎవరు మీరంటూ వారిని నిలదీస్తున్నా ఆగలేదు.