Ex Minister Balineni: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు హాజరైన ఆయన తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని రూ.50 లక్షలు పందెం కాసినట్లు వెల్లడించారు. ఇప్పుడివే కామెంట్స్ హాట్ గా మారాయి. మరో వ్యక్తి తెలంగాణ లో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాడన్నారు. కానీ కాంగ్రెస్ గెలుస్తుందని తెలిసినా.. తాను పందాన్ని రద్దు చేసినట్లు బాలినేని వెల్లడించారు .
అంతే కాదు రాజకీయాలపైన ఆయన పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే విరక్తి పుడుతోందన్నారు బాలినేని. అంతే కాదు ఈనాటి రాజకీయాలు అన్నీ కుల ప్రాతిపదికగా జరగుతున్నాయన్నారు. అలాగే మంత్రిగా ఉన్నప్పుడు డబ్బులు తీసుకున్నట్లు బాలినేని వెల్లడించారు. తాను అన్నీ నిజాలే మాట్లాడతానన్న బాలినేని.. డబ్బులు తీసుకున్న విషయాన్ని కూడా బయట పెట్టారు. లేనిపక్షంలో రాజకీయాలు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు తనకు సినిమాలపై ఇష్టం ఉండేదని, సినిమా తీయాలని కోరికగా ఉండేదన్నారు. ఇప్పుడు సినిమాల వైపే వెళ్లాలని ఉందని, ఇక్కడ ప్రజలు తనను కావాలనుకుంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. సీఎం జగన్ అంటే తనకు చాలా ఇష్టమన్న బాలినేని.. ఏపీలో మళ్లీ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.