Uttam Kumar Reddy | బీజేపీ ఎమ్మెల్యేలు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెమ్ స్పీకర్గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రమాణ స్వీకారం చేయలేదు. ఒక సీనియర్ ఎమ్మెల్యేని మాత్రమే ప్రొటెమ్ స్పీకర్ చేయాలని బిజేపీ ఎమ్మేల్యేలు వాదిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అసెంబ్లీలో సంఖ్యా బలం లేనందు వల్లే ఎంఐఎం ఎమ్మెల్యేకు ప్రొటెమ్ స్పీకర్ పదవి ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తున్నారు.
Uttam Kumar Reddy | బీజేపీ ఎమ్మెల్యేలు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెమ్ స్పీకర్గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రమాణ స్వీకారం చేయలేదు. ఒక సీనియర్ ఎమ్మెల్యేని మాత్రమే ప్రొటెమ్ స్పీకర్ చేయాలని బిజేపీ ఎమ్మేల్యేలు వాదిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అసెంబ్లీలో సంఖ్యా బలం లేనందు వల్లే ఎంఐఎం ఎమ్మెల్యేకు ప్రొటెమ్ స్పీకర్ పదవి ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తున్నారు.
దీనికి కౌంటర్గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. “రాజ్యాంగ బద్ధంగా అసెంబ్లీ నిర్వహణ చట్టాలకు లోబడే అక్బరుద్దీన్ని ప్రొటెమ్ స్పీకర్గా నియామకం జరిగింది. తెలంగాణ అసెంబ్లీలో సీనియర్ వ్యక్తికి ప్రొటెమ్ స్పీకర్ చేయాలనేది నిజమే.. ప్రస్తుతం సభలో నేనే సీనియర్ ఎమ్మెల్యే కానీ నాకు మంత్రిగా బాధ్యతలుండడం వల్ల నా తరువాత సీనియర్ ఎమ్మెల్యే అయిన అక్బరుద్దీన్ను ప్రొటెమ్ స్పీకర్గా ప్రభుత్వం నియమించింది. ఇందులో రాజకీయ కోణం ఏమాత్రం లేదు. అన్ని మతాలు, వర్గాలను సమ ప్రధాన్యం ఇస్తూ.. అందరినీ కలుపుకొని ముందుకునడవడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం,” అని చెప్పారు.