Wanaparthy : రేవంత్ రెడ్డి సీఎం కావాలనే కోరిక నెరవేరినందున మొక్కు చెల్లించేందుకు బయల్దేరాడు ఓ యువకుడు. వనపర్తి నుంచి శ్రీశైలం వరకు పాదయాత్రగా వెళ్తున్నాడు. ఈ నెల 7న ప్రారంభమైన ఈ నడక ప్రస్తుతం నాగర్కర్నూల్ జిల్లాకు చేరుకుంది. ఎన్ని కష్టాలు పడైనా సరే తన మొక్కును చెల్లించుకుంటా అంటున్నాడు ఆ యువకుడు.
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానయపల్లికి చెందిన రాజు సీఎం రేవంత్కు వీరాభిమాని. ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని శ్రీశైల మల్లికార్జునుడికి మొక్కుకున్నాడు. ఆ తర్వాత వెలువడిన ఫలితాలలో కాంగ్రెస్ విజయం సాధించడం… ఆ తర్వాత రేవంత్ సీఎం కావడం చకచకా జరిగిపోయాయి. దీంతో తన కోరిక తీరినందుకు మొక్కు చెల్లించేందుకు శ్రీశైలానికి బయల్దేరాడు రాజు. కానాయపల్లి నుంచి కాలినడకన రేవంత్ ఫోటో పట్టుకొని వెళ్తున్నాడు. ఎన్ని ఇబ్బందులు పడైనా సరే శ్రీశైలానికి చేరుకుంటానని చెప్తున్నాడు రాజు.