మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పుణె జిల్లాలో చించవాడ్ ప్రాంతంలోని కొవ్వొత్తుల తయారీ కేంద్రంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఎనిమిది మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తిసుకువచ్చారు. స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.