Nandyala : విద్యుత్ ఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా శిరివెళ్ల మండల కేంద్రంలోని రిజిస్టర్ ఆఫీస్ సమీపంలో జరిగింది. పొలంలో మందు పిచికారీ చేయడానికి వెళ్ళి ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై మంగలి చిన్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మరణించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.