కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన క్షణం నుంచే ఎన్నికల హామీలపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్రెడ్డి. ఈ మేరకు హామీలలో భాగమైన ప్రజా దర్బార్ను ప్రజా భవన్లో నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ వైఫల్యాలను టార్గెట్ చేసిన రేవంత్ ఆ దిశగానే ముందుకు సాగుతున్నారు. కేసీఆర్ ప్రజల గోడు వినరని.. ప్రజంటే పట్టదని విమర్శలు గుప్పించిన రేవంత్.. తాను ప్రజాపాలన చేసి చూపిస్తానని జనానికి భరోసా ఇచ్చారు. ఈ మేరకు ప్రగతిభవన్ను జ్యోతిరావ్పూలే ప్రజా భవన్గా పేరు మార్చిన ఆయన.. ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ పేరుతో ప్రజా సమస్యలను స్వయంగా వినడమే కాదు.. పరిష్కార దిశగా చర్యలు తీసుకోనున్నారు. ప్రజా దర్బార్ నిర్వహణ సందర్భంగా నేరుగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు సీఎం రేవంత్. రేవంత్తోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ప్రజల గోడును తెలుసుకుంటున్నారు.
సీఎం హోదాలో కేసీఆర్ అధికారిక నివాసంగా ఉన్న ప్రగతిభవన్.. ఇప్పుడు ప్రజాభవన్గా మారింది. బీఆర్ఎస్ హాయంలో 2017 నవంబర్ 23 నుంచి 2023 డిసెంబర్ 3 వరకూ ఇక్కడి నుంచే పాలన సాగించారు కేసీఆర్. అయితే,.. ఆయన ఉన్న సమయంలో ప్రగతి భవన్కి భారీ ఉక్కు కంచెను ఏర్పాటు చేయించారు. దాంతో అందులోకి వెళ్లేందుకు సామాన్యులకు అనుమతి ఉండేది కాదు. ఇందుకోసం ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. అయితే,.. కేసీఆర్కు భిన్నంగా రేవంత్ ప్రగతిభవన్కు ప్రజా భవన్గా మార్చారు. ఇక నుంచి ఎవరైనా ఇక్కడి రావొచ్చని.. స్పెషల్గా అనుమతులేమీ అవసరం లేదన్నారు. ఇదిలా ఉంటే సీఎంగా రేవంత్ ప్రమాణస్వీకార కార్యక్రమం కొనసాగుతుండగానే ప్రగతి భవన్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగిస్తూ ప్రజా పాలనను కొనసాగిస్తానంటూ సంకేతాలు పంపారు రేవంత్. దీంతో ఈ అంశంపై పెద్ద టాక్ నడిచింది.