నేడు సీఎం వైఎస్ జగన్ తిరుపతి, బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్ధాయిలో పర్యటన చేయనున్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం స్వర్ణముఖి నదికట్ట తెగి నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటిస్తారు. గ్రామస్ధులతో జగన్ మట్లాడి.. ఆ తరువాత తుపాను బాధితులతో నేరుగా సమావేశమవుతారు.
అక్కడి నుంచి బయలుదేరి బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెం చేరుకుంటారు. అక్కడ తుపాను బాధితులను కలిసి వారి సమస్యలు తెలుసుకోనున్నరు. అనంతరం కర్లపాలెం మండలం పాతనందాయపాలెం చేరుకుని రైతులతో మాట్లాడనున్నారు. అక్కడి నుంచి బుద్దాం చేరుకుంటారు. తుపాను వల్ల దెబ్బతిన్న వరిపంటలను పరిశీలించి రైతులతో సమావేశమవుతారు. సాయంత్రం బుద్దాం నుంచి తాడేపల్లికి బయలుదేరుతారు.