బీఆర్ఎస్ పాలనలో మాజీ సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతిభవన్ ఇప్పడు ప్రజా భవన్గా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రగతిభవన్ను.. ప్రజా భవన్గా చేస్తామని రేవంత్రెడ్డి చెప్పారు. చెప్పినట్టుగానే ఎన్నికల్లో విజయం సాధించిన రేవంత్ ప్రగతిభవన్ను ప్రజా భవన్గా మార్చడంతో ఆంక్షలు ఎత్తివేసింది కాంగ్రెస్ సర్కార్. దీంతో ఎలాంటి రూల్స్ లేకుండా మామూలుగానే వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ట్రాఫిక్ సమస్య కూడా తగ్గడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పాయి.
ఇచ్చిన హామీ మేరకు ఓ వైపు ప్రమాణస్వీకార కార్యక్రమం నడుస్తుండగానే ప్రగతిభవన్ బారికేడ్లను కూల్చే చర్యలకు ఆదేశించారు రేవంత్. దీంతో ప్రగతిభవన్ ముందు ఉన్న బ్యారికేడ్లు, గ్రిల్స్ని పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు. అంతేకాకుండా ప్రగతి భవన్ ముందు రోడ్డుపై ఉన్న బ్యారికేడ్స్ లోపల నుంచి కూడా వాహనాలు వెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు అనుమతించారు.